Jump to content

User:Kavita Reddy D

From Wikipedia, the free encyclopedia

MALLU SUBBA REDDY, Freedom fighter Advocate and MLA

ఆంగ్లేయుల పరిపాలనతో మగ్గుతున్న భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సంపాదించడం. కోసం మహాత్మాగాంధి ప్రారంభించిన స్వాతంత్య్ర సమరంలో ఎందరో త్యాగధనులు తమ ధనమాన ప్రాణాలను లెక్కచేయక పాల్గొన్నారు. వారిలో రాయలసీమలో నంద్యాలకు చెందిన శ్రీ మల్లు సుబ్బారెడ్డి గారు ప్రముఖులు,

నంద్యాల మొదటి MLA అయిన శ్రీ మల్లు సుబ్బారెడ్డి గారు పాణ్యం గ్రామంలో వ్యవసాయ కుటుంబములో జన్మించారు. ఈయనకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి. మల్లు సుబ్బారెడ్డి గారు S.S.L.C. వరకు నంద్యాల SPG హై స్కూల్ యందు తరువాత ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అనంతపురం ఆర్ట్స్ కాలేజిలో, తర్వాత "లా" డిగ్రీ మద్రాసు "లా" కాలేజీలో పూర్తి చేసి, నంద్యాలలో న్యాయవాద వృత్తి చేపట్టినారు. 1941వ సంవత్సరములో బ్రిటీషు పరిపాలనకు వ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహములో పాల్గొని మూడు నెలలు బళ్ళారి సెంట్రల్ జైలులో గడిపి తరువాత 1942వ సంవత్సరం నుండి 1944వ సంవత్సరం వరకు క్విట్ ఇండియా ఉద్యమములో పాల్గొని ఒకటిన్నర సంవత్సరములు వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్ష అనుభవించినారు. 1952వ సంవత్సరములో స్వాతంత్ర్యము వచ్చిన తరువాత మొట్టమొదటి |శాసనసభ ఎన్నికలలో మల్లు సుబ్బారెడ్డి గారికి నంద్యాల నియోజకవర్గము కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినారు. 1954వ సంవత్సరములో అప్పటి ముఖ్యమంత్రి అయిన ప్రకాశం పంతులు గారి ప్రభుత్వము మద్యపాన నిషేదము ఎత్తివేయాలని ఓటింగు జరిగినది. ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారు మల్లు సుబ్బారెడ్డి గారిని ప్రభుత్వానికి అనుకూలముగా ఓటు వేయమని, మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పినా తిరస్కరించి మద్యపాన నిషేదము ఉండవలయునని ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఓటువేయడముతో ఆ ఒక్క ఓటుతో ప్రభుత్వము పడిపోయినది. మరలా 1955వ సంవత్సరము నందు ఎన్నికలు జరిగినాయి.

మరల 1962వ సంవత్సరము నందు నంద్యాల నియోజకవర్గము నుండి ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీ చేసి 1967వ సంవత్సరము వరకు MLA గా కొనసాగినారు. 1968వ సంవత్సరములో దివంగతులైనారు. మల్లు సుబ్బారెడ్డి గారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడైన మల్లు రామచంద్రా రెడ్డి గారు రాజకీయములకు దూరంగా ఉంటూ నంద్యాలలో గల మెడిసేవా డయాగ్నసిస్ సర్వీసెస్కు M.D. గా కొనసాగుతున్నారు. విలువలకు మారుపేరు మన నంద్యాల మొదటి MLA శ్రీ మల్లు సుబ్బారెడ్డి గారు.

నంద్యాల మొదటి MLA అయిన శ్రీ మల్లు సుబ్బారెడ్డి గారు పాణ్యం గ్రామంలో వ్యవసాయ కుటుంబములో జన్మించారు. ఈయనకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి. మల్లు సుబ్బారెడ్డి గారు S.S.L.C. వరకు నంద్యాల SPG హై స్కూల్ యందు తరువాత ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అనంతపురం ఆర్ట్స్ కాలేజిలో, తర్వాత "లా" డిగ్రీ మద్రాసు "లా" కాలేజీలో పూర్తి చేసి, నంద్యాలలో న్యాయవాద వృత్తి చేపట్టినారు. 1941వ సంవత్సరములో బ్రిటీషు పరిపాలనకు వ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహములో పాల్గొని మూడు నెలలు బళ్ళారి సెంట్రల్ జైలులో గడిపి తరువాత 1942వ సంవత్సరం నుండి 1944వ సంవత్సరం వరకు క్విట్ ఇండియా ఉద్యమములో పాల్గొని ఒకటిన్నర సంవత్సరములు నెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్ష అనుభవించినారు. 1952వ సంవత్సరములో స్వాతంత్ర్యము వచ్చిన తరువాత మొట్టమొదటి శాసనసభ ఎన్నికలలో మల్లు సుబ్బారెడ్డి గారికి నంద్యాల నియోజకవర్గము కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినారు. 1954వ సంవత్సరములో అప్పటి ముఖ్యమంత్రి అయిన ప్రకాశం పంతులు గారి ప్రభుత్వము మద్యపాన నిషేదము ఎత్తివేయాలని ఓటింగు జరిగినది. ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారు మల్లు సుబ్బారెడ్డి గారిని ప్రభుత్వానికి అనుకూలముగా ఓటు వేయమని, మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పినా తిరస్కరించి మద్యపాన నిషేదము ఉండవలయునని ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఓటువేయడముతో ఆ ఒక్క ఓటుతో ప్రభుత్వము పడిపోయినది. మరలా 1955వ సంవత్సరము నందు ఎన్నికలు జరిగినాయి.

మరల 1962వ సంవత్సరము నందు నంద్యాల నియోజకవర్గము నుండి ఇండిపెండెంటు అభ్యర్ధిగా పోటీ చేసి 1967వ సంవత్సరము వరకు MLA గా కొనసాగినారు. 1968వ సంవత్సరములో దివంగతులైనారు. మల్లు సుబ్బారెడ్డి గారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడైన మల్లు రామచంద్రా రెడ్డి గారు రాజకీయములకు దూరంగా ఉంటూ నంద్యాలలో గల మెడిసేవా డయాగ్నాసిస్ సర్వీసెస్కు M.D. గా కొనసాగుతున్నారు.